fbpx
Sunday, May 4, 2025
HomeMovie News'ఏపి ఈజ్ వాచింగ్' అంటూ హీరో రామ్ సంచలన ట్వీట్స్

‘ఏపి ఈజ్ వాచింగ్’ అంటూ హీరో రామ్ సంచలన ట్వీట్స్

Rampothineni Addressing VijayawadaFireAccident

విజయవాడ: విజయవాడ స్వర్ణ పాలస్ కోవిడ్ సెంటర్ ల జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పడు రాజకీయ రంగు పులుముకుంటుంది. తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తప్పు ఆసుపత్రి నిర్వహించిన ‘రమేష్ ఆసుపత్రిదని‘, నిర్వహించిన ‘స్వర్ణ పాలస్ వాళ్ళది అని’, అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులదని ఇలా అందరి మీద సోషల్ మీడియా లో నిందలు వేస్తుకుంటున్నారు. ఈ క్రమం లో సీఎం జగన్ ను ఉద్దేశించి హీరో రామ్ ట్వీట్ చేశారు. దీనివెనుక పెద్ద కుట్ర జరుగుతోందంటూ విన్నవించాడు.

హీరో రామ్ ట్వీట్ చేస్తూ “హోటల్ స్వర్ణ ప్యాలెస్ ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చకముందు ప్రభుత్వం అక్కడే క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు” అని ప్రశ్నించారు.
ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజుల వైపు మళ్లిస్తున్నారు’ అంటూ రమేశ్ ఆసుపత్రిపై విమర్శిస్తున్న వారికి హీరో రామ్ రెస్పాన్స్ ఇచ్చాడు.

ఇక మేనేజ్ మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని ట్విట్టర్ లో ఆ బిల్స్ ను హీరో రామ్ పోస్ట్ చేశారు. దీనివెనుక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది సీఎం జగన్ గారు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా మీ మీద నమ్మకాన్ని పెట్టుకున్న వారికి డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ల మీద ఓ లుక్కేయండి అంటూ రామ్ ట్విట్టర్ లో జగన్ కు విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular