fbpx
Friday, October 18, 2024
HomeAndhra Pradeshఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ డోర్ డెలివరీ

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ డోర్ డెలివరీ

RATION-DOOR-DELIVERY-IN-AP-FROM-FEBRUARY-1ST

తాడేపల్లి: రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

ధాన్యం సేకరించిన తర్వాత 15 రోజుల్లోగా గతంలో చెప్పినట్లుగా పేమెంట్లు జరిగేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి కల్లా పూర్తిగా రైతుల బకాయిలు చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని, ఈ ఖరీఫ్‌కు సంబంధించి నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరపాలని సీఎం సూచించారు.

ఆపై ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభించడానికి సీఎం నిర్ణయించారు. అదే రోజున 10 కిలోల రైస్‌ బ్యాగ్స్‌ ఆవిష్కరణ, మరియు వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఇందు కోసం 9260 మొబైల్‌ యూనిట్లు. అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలు సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular