fbpx
Saturday, February 22, 2025
HomeBusinessఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ క్రిప్టోకరెన్సీపై‌ కీలక వ్యాఖ్యలు

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ క్రిప్టోకరెన్సీపై‌ కీలక వ్యాఖ్యలు

RBI-GOVERNOR-COMMENTS-ON-CRYPTOCURRENCIES-IN-INDIA

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ విలువ రాకెట్ కంటే వేగంగా ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్ ఒక‌ కీలక ప్రకటన చేశారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ లో క్రిప్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆర్‌బిఐ ఆందోళన చెందుతోంది అని అన్నారు.

దీని గురించి తాము ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు శక్తికాంత దాస్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో లభ్యతలో ఉన్న అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించి, ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని ఆయన‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఉన్న డిజిటల్ కరెన్సీల ద్వారా మోసానికి పాల్పడుతున్నారని, 2018లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్‌బీఐ వాటిని నిషేధించింది అని తెలిపింది. అయితే, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఆర్‌బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది.

ప్రైవేటు క్రిప్టో కరెన్సీని అదుపు చేసి, దేశంలో సొంతంగా డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో లీనమయ్యింది. ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్‌ యువాన్‌తో పాటు డిజిటల్‌ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్‌ చేరనున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన సాంకేతికపై పనిచేతున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular