స్పోర్ట్స్ డెస్క్: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
బెంగళూరుతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలన్న ఆశలన్నీ గల్లంతయ్యాయి.
169 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ అజేయంగా 73 పరుగులు (39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) చేస్తూ రన్ ఛేజ్కి నడిపించాడు.
సాయి సుదర్శన్ 49 పరుగులు (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సు) చేసి మంచి బేస్ ఇచ్చాడు. రూధర్ఫోర్డ్ 30 పరుగులు (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు)తో సహకరించాడు.
ఆర్సీబీ బ్యాటింగ్లో లియామ్ లివింగ్స్టోన్ 54 పరుగులు (40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులు), జితేశ్ శర్మ 33 (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ 32 (18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) రాణించారు.
అయితే, టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ 7, పడిక్కల్ 4, కృనాల్ 5 పరుగులకే పెవిలియన్ చేరారు.
గుజరాత్ బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు (4 ఓవర్లలో 19 పరుగులు), సాయి కిశోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ ఒక్కో వికెట్ తీశారు.
ఆర్సీబీ చివరి ఐదు ఓవర్లలో 63 పరుగులు చేసి స్కోర్ను 169/8కి చేర్చినా, గుజరాత్ దూకుడుకు ఆగలేకపోయింది.
బట్లర్ మేనియా ముందు బెంగళూరుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నిలకడగా ముందుకు సాగుతోంది.