fbpx
Saturday, September 7, 2024
HomeBusinessరిలయన్స్ విషయంలో ముఖేష్ కీలక నిర్ణయం!

రిలయన్స్ విషయంలో ముఖేష్ కీలక నిర్ణయం!

RELIANCE-INDEPENDENT-ASSOCIATE-COMPANY

ముంబై: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) కంపెనీ ఒక సంచలన నిర‍్ణయాన్ని వెలువరించింది. వారి ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాలన్నింటినీ కలిపి ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందించనున్నట్లు ఈ రోజు (మంగళవారం) ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ఈ వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడే ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని ఆర్‌ఐఎల్ తెలిపింది. ఇప్పుడున్న పూర్తి అపరేటింగ్‌ టీం, ఆ కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండబోవని పేర్కొంది.

ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియ ద్వారా కంపెనీ లో ఉన్న వాటాదారుల్లో ఎలాంటి మార్పు జరగదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్‌ తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం లభించినట్టు ఆర్ఐఎల్ తెలిపింది.

కాగా ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ, ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ల నుండి క్లియరెన్స్ ఇంకా పొందలేదని చెప్పింది. 2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్‌సీఎల్‌టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సంస్థకు చెందిన రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ ఆస్తులు అన్నీ ఈ కొత్త అనుబంధ సంస్థలోకి బదిలీ అవుతాయి. సౌదీ అరామ్‌కోతో ఒప్పందం అనంతరం మరింతగా ఇన్వెస్టర్ల ద్వారా కేపిటల్ సమకూర్చుకోవడానికి దోహద పడుతుందని కంపెనీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular