fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshమరో వివాదంలో మాజీ మంత్రి ఆర్కే రోజా!

మరో వివాదంలో మాజీ మంత్రి ఆర్కే రోజా!

RK-ROJA-IN-CONTROVERSY-AT-TIRUCCHENDUR

తిరుచ్చెందూర్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన వరుషాభిషేకంలో ఆర్కే రోజా మరియు ఆమె భర్త సెల్వమణి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో గుడి ఆవరణలో తనతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులను తనకు దగ్గరగా రావొద్దన్న రోజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమెను ఆలయంలో చూసిన భక్తుల్లో చాలామంది తనతో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆమెతో సెల్ఫీ కోసం వెళ్లగా దూరంగా నిల్చోవాలని సైగ చేస్తూ రోజా వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో వారు కొంత దూరం నుండీ రోజాతో సెల్ఫీ తీసుకున్నారు.

ఈ వీడియో వైరల్ అవగా, తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రోజాను, మీకెందుకు అంత కుల గర్వం, తక్కువ కులం వాళ్ళంటే చిన్న చూపా అని ప్రశ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular