fbpx
Saturday, February 22, 2025
HomeNationalకరోనా తో పంజాబీ గాయకుడు శార్దుల్‌ మృతి

కరోనా తో పంజాబీ గాయకుడు శార్దుల్‌ మృతి

SARDOOL-DIES-OF-CORONA

చండీఘ‌ర్ : ప్రముఖ పంజాబ్ రాష్ట్ర గాయకుడు అయిన శార్దుల్‌ సికందర్ కరోనా తో కన్నుమూశారు. ఆయన వయసు 60 ఏళ్లు. ఇటీవలే శార్దుల్‌ కరోనా పాజిటివ్ గా‌ పరీక్షింప పడ్డారు. దీంతో ఆయనను మొహాలీలోని ఫోర్టిస్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు కరోనాతో పాటు మరి కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స పొందుతూ​ శార్దుల్‌ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

అతని మరణాన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ట్విటర్‌లో తెలిపారు. ఆ సింగర్‌ మృతిప‌ట్ల పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ సంతాపం ప్రకటించారు. అతని కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టిస్తూ, పంజాబ్ వాసులు గొప్ప సింగ‌ర్‌, న‌టుడిని కోల్పోయార‌ని ఆయన పేర్కొన్నారు.

అతని మ‌ర‌ణం పంజాబీ ఫిలిం ఇండ‌స్ట్రీకి పెద్ద లోటు అని అన్నారు. సీఎంతో పాటు శిరోమ‌ణి అకాలీద‌ళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్, ఇతర ప్రముఖులు, గాయకులు శార్దుల్‌ మృతిపై దిగ్భ్రాంతి ప్రకటించారు. కాగా శార్దూల్ సికిందర్‌ పంజాబీ ఫోక్ సింగర్‌, పాప్ సింగ‌ర్‌. 1980లో ఆయ‌న రోడ్‌వేస్ ది లారీ పేరిట‌ మొద‌టి ఆల్బ‌మ్‌ను విడుద‌ల చేశారు.

దాని త‌ర్వాత శార్దూల్‌కు మంచి పాపులారిటీ వ‌చ్చింది. మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయ‌న న‌ట‌న‌కు మంచి గుర్తింపు కూడా వ‌చ్చింది. జ‌గ్గా ద‌కురా మూవీలో శార్దూల్ న‌ట‌న ఎంద‌రినో మెప్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular