fbpx
Sunday, February 23, 2025
HomeBusinessజూలై 1 నుండీ ఎస్బీఐ కొత్త చార్జీల మోత

జూలై 1 నుండీ ఎస్బీఐ కొత్త చార్జీల మోత

SBI-LEVY-NEW-CHARGES-FROM-JULY-1ST

ముంబై: భారత దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ కస్టమర్లకు ఒక హెచ్చరిక. ఎస్బీఇ తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను తాజాగా సవరించింది. ఏటీఎం నుండి డబ్బులు తీసుకోవడం, చెక్‌బుక్, మరియు ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో ఎటువంటి కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

కాగా ఎస్‌బీఐలో తన జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ఇస్తుంది. ఈ కార్డు ద్వారా నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువసార్లు విత్ డ్రా చేస్తే మాత్రం సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే రానున్న జూలై 1 నుంచి బ్యాంక్ కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది.

ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్‌టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. అయితే బ్యాంఖ్ లో అకౌంట్ ఉన్న సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular