fbpx
Saturday, September 7, 2024
HomeNationalదక్షిణ మధ్య రైల్వేకు ఇంధన పొదుపులో పురస్కారాలు

దక్షిణ మధ్య రైల్వేకు ఇంధన పొదుపులో పురస్కారాలు

SCR-WON-THREE-AWARDS-FROM-ENERGY-EFFICIENCY

హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వే ఇంధన పొదుపులో కేంద్రం నుంచి మూడు పురస్కారాలు సాధించింది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ద్వారా ఈ అవార్డులు ప్రకటించబడ్డాయి. కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ వర్చువల్‌ సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ సోమేశ్‌కుమార్‌కు ఈ పురస్కారాలు అందించారు.

పరిశ్రమ మరియు రైల్వే వర్క్‌షాప్‌ కేటగిరీలో విజయవాడ డీజిల్‌ లోకో షెడ్‌ ప్రథమ బహుమతి పొందింది. భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో సికింద్రాబాద్‌లోని ఎస్‌సీఆర్‌ అకౌంట్స్‌ కార్యాలయ భవనానికి రెండో స్థానంలో అవార్డు వరించింది. ట్రాన్స్‌పోర్టు, జోనల్‌ రైల్వే కేటగిరీలో దక్షిణ మధ్య రైల్వే ‘జోన్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌’ సాధించింది.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్‌ (07456) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular