fbpx
Saturday, October 26, 2024
HomeLife Styleకరోనా సెకండ్‌ వేవ్ ఎఫెక్ట్: ఇల్లు కదలక్కర్లేదు

కరోనా సెకండ్‌ వేవ్ ఎఫెక్ట్: ఇల్లు కదలక్కర్లేదు

SECOND-WAVE-MADE-WFH-EXTEND-IN-IT-SECTOR

అమరావతి: కరోనా మహమ్మారి వల్ల వర్క్‌ ఫ్రం హోమ్, దేశంలో మరియు ప్రపంచంలోని ఐటీ రంగ సంస్థలు జపిస్తున్న తారక మంత్రమిది. ఈ పరిణామం కీలక మార్పులకు నాంది పలుకుతూ, ఐటీ రంగాన్ని పరోక్షంగా చిన్న పట్టణాలు, పల్లెలకు చేరువ చేస్తోంది. కాగా ఇది ఏపీ రాష్ట్రానికికి చాలా సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో ఉన్న చిన్న పెద్ద అని లేకుండా దాదాపు అన్ని ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీవో) కంపెనీలు ‘వర్క్‌ ఫ్రం హోమ్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) విధానాన్ని కొనసాగించాలని తాజాగా నిర్ణయించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఈ నెల 31తో ముగియాల్సి ఉంది. కానీ దేశంలో ఇంకా కరోనా ముప్పు తొలగకపోవడం, మరీ సెకండ్‌ వేవ్‌ వస్తుందనే అంచనాలతో ఐటీ కంపెనీలు రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. అందుకే తమ ఉద్యోగులకు డబ్ల్యూఎఫ్‌హెచ్‌ను 2021మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయించాయి.

మన దేశంలో దాదాపు 45 లక్షల మంది ఐటీ, బీపీవో ఉద్యోగులు ఉన్నారని అంచనా. వారిలో దాదాపు 98 శాతం మంది ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి డబ్ల్యూఎఫ్‌హెచ్‌ విధానంలోనే పని చేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలలో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 8.75 లక్షల మంది తమ ఇళ్ల నుంచే ఇప్పటికీ పని చేస్తున్నారు.

టీసీఎస్‌ కంపెనీ మరో ముందడుగు వేసి 2025 వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కరోనా ప్రభావం తొలగిపోయినా సరే 2025 వరకు కేవలం 25 శాతం మందే కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, మిగతా 75 శాతం మంది డబ్ల్యూఎఫ్‌హెచ్‌ విధానంలోనే పని చేయాలన్నది ఆ కంపెనీ ఉద్దేశం.

ఇన్ఫోసిస్‌ కంపెనీ కూడా భవిష్యత్‌లో తమ ఉద్యోగులలో సగం మంది మాత్రమే ఆఫీసుకు వస్తే చాలని భావిస్తోంది. దేశంలో ప్రముఖ కంపెనీలు నగరాల్లోని తమ కార్యాలయాల అద్దెలు, ఇతర నిర్వహణ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గత ఆరు నెలల్లో ఐటీ కంపెనీలు సగటున 40 శాతం వరకు కార్యాలయ భవనాలను ఖాళీ చేయడం గమనార్హం.

కరోనా ప్రభావంతో కార్మిక చట్టం నిబంధనలను సడలించాలన్న ఐటీ, బీపీవో కంపెనీల వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందిచడం కూడా కలిసొచ్చింది. ‘వర్క్‌ ఫ్రం హోమ్, వర్క్‌ ఫ్రం ఎనీవేర్‌’ అనే అంశాలకు స్థానం కల్పిస్తూ ఐటీ, ఇతర సర్వీస్‌ ప్రొవైడర్ల సేవల నిబంధనలను కేంద్రం ఇటీవల సడలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular