fbpx
Monday, September 16, 2024
HomeBusinessలాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

SENSEX-ENDS-ON-PROFITS-AMID-IT-SHARES

ముంబై: గత రెండు రోజులుగా చవిచూసిన నష్టాలకు చెక్‌ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు శుక్రవారం తిరిగి జోష్‌లోకి వచ్చాయి. లాభాలతో మొదలై చివరిదాకా అదే రేంజ్‌ను కొనసాగించాయి. భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మరో ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేశాయి మార్కెట్లు.

ఇంఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ఫార్మా స్టాక్స్‌కు కొనుగోళ్ళ మద్దతుతో కీలక సూచీలు ఇవాళ రికార్డుల మోత మోగించాయి. సరికొత్త గరిష్టాల నమోదుతో పాటు వారాంతంలో రికార్డు స్థాయి వద్ద ఉత్సాహంగా ముగిశాయి. చివరికి సెన్సెక్స్‌ 689 పాయింట్లు ఎగిసి 48782 వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల లాభంతో 14347 వద్ద ముగిసాయి.

అన్నింటి కంటే ముఖ్యంగా 5 శాతం లాభంతో టెక్ మహీంద్రా 30 షేర్ల ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది, దానితో పాటు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్‌లోకి ప్రవేశించి, ఈ ఘనతను సాధించిన ఐదవ ఐటీ సంస్థగా నిలిచింది. తాజా లాభాలతో టెక్‌ మహీంద్ర మార్కెట్‌ క్యాప్‌ 1.01 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular