fbpx
Sunday, September 8, 2024
HomeTelanganaకేసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

కేసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

SET-BACK-TO-KCR-IN-SUPREME-COURT

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ నిమిత్తం జస్టిస్ నరసింహారెడ్డిని ఛైర్మన్ గా నియమిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది.

కాగా కేసీఆర్ ఈ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళగా, ఆ అభ్యర్థనను హైకోర్టు కొట్టేసింది. అందుకు ఆయన తదుపరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కేసీఆర్ పిటిషన్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టీంది. విచారణ తరువాత ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ ను డిస్మిస్ చేసి, ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ కొనసాగించాలని ఆదేశించింది.

కాగా ఈ విషయమై కొత్తగా ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే దీనిని జ్యుడీషియల్ ఎంక్వైరీ అని కాకుండా ఎంక్వైరీ కమిషన్ గా పిలవాలని తెలిపింది. అలాగే కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో ఇంకొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఛైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు విన్నవించింది. రిటైర్డ్ జడ్జిలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త ఛైర్మన్ పేరును తెలియజేయడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular