fbpx
Saturday, February 22, 2025
HomeTelanganaటన్నెల్ ప్రమాదం: రేవంత్ కు మోదీ ఫోన్ కాల్

టన్నెల్ ప్రమాదం: రేవంత్ కు మోదీ ఫోన్ కాల్

slbc tunnel accident rescue operations ongoing

తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్‌లో పనులు జరుగుతుండగా పైభాగం కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి పంపింది. అత్యాధునిక పరికరాలతో క్షుణ్ణంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

టన్నెల్‌లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి 24 గంటలు నిరంతర ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఆపరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular