ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా గా రూపొందుతుంది. ఒక పల్లెటూరు అమ్మాయి నేషనల్ లెవెల్ షూటింగ్ గేమ్స్ కి ఎలా వెళ్ళింది , నేషనల్ మెడల్ ఎలా శాసించింది.. ఇది సాధించడానికి ఆమె ప్రయాణాన్ని చూపించబోతున్నట్టు ఇదివరకే విడుదలైన టీజర్ లో తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. తాను తీసిన కొన్ని సినిమాలతోనే వైవిధ్యమైన దర్శకుడిగా పేరుపొందిన ‘నగేష్ కుకునూర్‘ ఈ సినిమాకి దర్శకత్వహిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న మొదటి తెలుగు సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.