జైపూర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్కి నోటీసులు జారీ చేసింది. వీరు ప్రచారం చేసిన పాన్ మసాలా యాడ్ మోసపూరితంగా ఉందని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. జైపూర్కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ ఫిర్యాదు మేరకు, ఈ ప్రకటన ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని కోర్టుకు వివరించారు.
ఈ యాడ్లో ఉపయోగించిన “దానె దానె మే కెసర్ కా దమ్” అనే ట్యాగ్లైన్ అసత్యమని ఆరోపణలు వచ్చాయి. అసలు ఉత్పత్తిలో కేశర్ ఉండదని, తప్పుడు ప్రచారంతో వినియోగదారులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం షారుఖ్, అజయ్, టైగర్తో పాటు వాణిజ్య సంస్థ జేబీ ఇండస్ట్రీస్ అధినేత విమల్ కుమార్ అగర్వాల్కూ నోటీసులు పంపింది.
కోర్టు వీరందరికీ మార్చి 19న హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే వారి గైర్హాజరీలో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిషన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటివరకు ఈ అంశంపై బాలీవుడ్ స్టార్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఫేమస్ సెలబ్రిటీల ప్రమోషన్లతో ప్రజలు తప్పుదారి పడుతున్నారని, ఈ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది బడియాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ యాడ్ను తక్షణమే బ్యాన్ చేయాలని, నటులు, కంపెనీకి జరిమానా విధించాలని కోర్టును కోరారు. మరి, ఈ వివాదంపై షారుఖ్, అజయ్, టైగర్ ఎలా స్పందిస్తారో చూడాలి.