fbpx
Friday, September 20, 2024
HomeTelanganaఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక తీర్పు!

ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక తీర్పు!

Supreme- key- decision- in- the- case- of- banknote- for- vote

తెలంగాణ: ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మహారాష్ట్రకు బదిలీ చేయబోమని స్పష్టంగా వెల్లడించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ కేసును తెలంగాణా నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) ముగించింది. అయితే, సీఎం ప్రభావం ఉంటుందన్న ఆరోపణలకు ఆధారాలు లేవని, ఇది కేవలం అపోహ మాత్రమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

విచారణ జరగుతున్న దశలో ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలు రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని కూడా కోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించింది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే, పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది.

ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో కీలక ఊరట లభించినట్టయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular