మూవీడెస్క్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, హీరోయిన్లుగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు.
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటికే సినీ బృందం విడుదల చేసిన టీజర్, ఫస్ట్లుక్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో మూవీ టీం చాలా బిజీగా ఉంది.
మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ రోజు వరంగల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు ఫిల్మ్ మేకర్స్. ఈ క్రమంలో తాజాగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ను విడుదల చేశారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.