fbpx
Wednesday, April 2, 2025
HomeAndhra Pradeshతెలుగువారి నమ్మకానికి ప్రతిరూపం తెదేపా: చంద్రబాబు

తెలుగువారి నమ్మకానికి ప్రతిరూపం తెదేపా: చంద్రబాబు

TDP-IS-A-REFLECTION-OF-THE-TRUST-OF-TELUGUS – CHANDRABABU

తెలుగువారి నమ్మకానికి ప్రతిరూపం తెదేపా: చంద్రబాబు

ఘనంగా తెదేపా 43వ ఆవిర్భావ వేడుకలు

అమరావతి (Amaravati): తెలుగు దేశం పార్టీ (TDP) తన 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రసంగించారు. తెదేపా ఆదర్శాల కోసం పుట్టిన పార్టీ అని, పార్టీని నిలబెట్టడమే మన బాధ్యత అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

“తెలుగువారు ఉన్నంత వరకు తెదేపా ఉంటుంది”

తెదేపా ఒక మహనీయుడి విజన్‌తో ఏర్పడిన పార్టీ అని చంద్రబాబు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao – NTR) ఆలోచనలే ఈ పార్టీకి పునాది అని స్పష్టం చేశారు. తెలుగువారి ప్రయోజనాలను కాపాడేందుకే తెదేపా పుట్టిందని, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించేందుకు తన ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. “తెలుగువారు ఉన్నంత వరకు తెదేపా ఉంటుంది. గతంలో చాలా మంది పార్టీని నాశనం చేయాలని చూశారు. కాని వారంతా కాలగర్భంలో కలిశారు. తెదేపా మాత్రం మరింత బలంగా ఎదుగుతూనే ఉంది” అని వ్యాఖ్యానించారు.

“పార్టీకి మనమంతా సేవకులమే”

తెదేపాలో ఎవరైనా పార్టీకి వారసులు మాత్రమే కానీ, పెత్తందారులు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. “నేను పార్టీకి అధ్యక్షుణ్ని.. కానీ అదే సమయంలో టీమ్ లీడర్‌ను మాత్రమే. ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలి. పార్టీకి చేసిన సేవకు తగిన గౌరవం లభించాలి” అని వివరించారు.

“తెదేపా నాటి స్వర్ణయుగం అని చెప్పుకోవాలి”

43 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నామని, కానీ వాటిని అవకాశంగా మార్చుకుని విజయాలను సాధించామని చంద్రబాబు తెలిపారు. “ముహూర్త బలం, సంకల్ప బలం తెదేపాకు ఉన్న ప్రత్యేకతలు. చరిత్రలో తెదేపా నాటి స్వర్ణయుగం అని చరిత్రలో మిగిలిపోతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ పరిపాలన ఆదర్శప్రాయమైనది

ఎన్టీఆర్ పాలన ద్వారా పేదలకు సంక్షేమం ఎలా చేయాలనే దానికి ఆదర్శాన్ని చూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. “పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి, ప్రజలకు అద్భుతమైన పాలన అందించిన ఏకైక నేత ఎన్టీఆర్‌. ఆయన చూపించిన మార్గంలోనే తెదేపా ముందుకు సాగుతోంది” అని తెలిపారు.

పసుపు సైనికులకు చంద్రబాబు అభివందనం

తెదేపా కార్యకర్తలను “పసుపు సైనికులు”గా అభివర్ణించిన చంద్రబాబు, పార్టీ విజయాల్లో వారి త్యాగం ఎంతో కీలకమని పేర్కొన్నారు. “పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు నా మనస్పూర్తిగా పాదాభివందనం” అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular