fbpx
Wednesday, February 12, 2025
HomeBig Storyటీమిండియా ఘనవిజయం.. ఇంగ్లండ్‌పై 3-0తో క్లీన్ స్వీప్

టీమిండియా ఘనవిజయం.. ఇంగ్లండ్‌పై 3-0తో క్లీన్ స్వీప్

team-india-clean-sweep-against-england

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు సిరీస్‌ను ఆధిపత్యంగా ముగించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. యువ బ్యాట్స్‌మన్ శుభ్ మన్ గిల్ (112) అద్భుత సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ (52), శ్రేయాస్ అయ్యర్ (78), కేఎల్ రాహుల్ (40) తో జట్టు భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4 వికెట్లు తీశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌట్ అయింది. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసి భారత విజయాన్ని సులభం చేశారు.

ఈ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్‌ను కూడా 4-1 తేడాతో గెలుచుకుంది. మొత్తం పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది.

ఇంగ్లండ్‌కు ఈ పర్యటనలో కేవలం ఒక్కటీ20 మ్యాచ్ మాత్రమే విజయం లభించింది. టీమిండియా దూకుడైన ఆటతో ఇంగ్లండ్‌ను పూర్తిగా చిత్తు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular