తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
నేటి మధ్యాహ్నం అధికారికంగా విడుదల
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ (Telangana Intermediate) ఫలితాలను మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), విద్యా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బోర్డు కార్యాలయంలో ఫలితాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy), ఇంటర్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ఫలితాల లింక్ మొబైల్కు
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఈయర్ ఫలితాలు అధికారిక వెబ్సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్ను ఉపయోగించి ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకంగా ఈసారి ప్రతి విద్యార్థికి ఫలితాల లింక్ మొబైల్ నెంబర్కు పంపనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
సర్వర్ సమస్యలకు ముందస్తు జాగ్రత్తలు
గతంలో ఫలితాల విడుదల సమయంలో ఎదురైన సర్వర్ సమస్యల నేపథ్యంలో ఈసారి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నిర్వహణ బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) తీసుకుంది. దాంతో ఫలితాలను జాలంలో సులభంగా పొందేలా టెక్నికల్గా అన్ని ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.
విద్యార్థులకు బోర్డు ప్రోత్సాహం
ఫలితాల నేపథ్యంలో ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య (Krishna Aditya) విద్యార్థులందరికీ ప్రేరణాత్మక సందేశాన్ని పంపించారు. ‘‘పరీక్షల్లో జయాపజయాలు సహజం. ఫెయిలయ్యారనో, తక్కువ మార్కులొచ్చాయనో నిరుత్సాహపడకండి. మీ లో ఉన్న ప్రతిభను మార్కుల పద్ధతితో అంచనా వేయలేము. మరింత శ్రమించండి, విజయాన్ని సాధించండి,’’ అని సూచించారు.
మానసిక ఒత్తిడికి సాయం
ఫలితాల అనంతరం మానసిక ఆందోళనకు గురవుతున్న విద్యార్థుల కోసం టెలీమానస్ టోల్ఫ్రీ సాయం సంఖ్యను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు 1800 891 4416 నంబర్కు కాల్ చేసి కౌన్సెలింగ్ పొందవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ విద్యార్థులు ఉండగా, ఫలితాల ప్రకటనతో విద్యా సంస్థల లెక్కలు ప్రారంభమయ్యాయి.