హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రోజు కరోనా కేసులు భారీగా పెరిగుతునే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించినా కరోనా మహమ్మారి మాత్రం అదుపులోకి రావడం లేదు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుతో సహా ఇప్పటికే పలు సంస్థలు లాక్డౌన్ విధించడమే సరైన మార్గం అని అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఇవాళ ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం విధించిన ఈ లాక్డౌన్ నేపథ్యంలో రోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.