fbpx
Friday, October 18, 2024
HomeTelanganaమిస్‌ ఇండియా విజేత తెలంగాణ అమ్మాయి!

మిస్‌ ఇండియా విజేత తెలంగాణ అమ్మాయి!

TELANGANA-WOMEN-MISS-INDIA-2020-WINNER

హైదరాబాద్‌ : అందాల పోటీలంటే అందరికీ ఇష్టమే. అలాంటి పోటిల్లో పాల్గొనాలని చాలా మంది తపిస్తుంటారు. దేశానికే పెద్దదైన అలాంటి ‘మిస్‌ ఇండియా 2020‘ టైటిల్‌ను తెలంగాణ తెలుగు అమ్మాయి సొంతం చేసుకుంది. 23 ఏళ్ల వయసున్న ఒక యువ ఇంజనీర్‌ అయిన మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటాన్ని సొంతం చేసుకుంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో మొత్తం 31 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు.

10వ తేదీ ఫిబ్రవరి న ముంబైలో నిర్వహించిన ఫైనల్‌ పోటీలో హర్యానాకు చెందిన మణికా షియోకాండ్ మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020 కాగా, యూపీకి చెందిన మన్యసింగ్‌ మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌లుగా నిలిచారు. మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్‌లో సినీ నటులునేహా ధూపియా, చిత్రంగడ సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్ ఫాల్గుని మరియు షేన్ పీకాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

మొదటి రౌండ్‌కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు. ఈ పోటీకి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ నెల 28న కలర్స్ టీవీ చాన‌ల్‌లో ప్రసారం కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular