fbpx
Friday, October 18, 2024
HomeBig Storyశ్రీనగర్‌లో కాల్పులతో రెచ్చిపోయిన ఉగ్రవాది

శ్రీనగర్‌లో కాల్పులతో రెచ్చిపోయిన ఉగ్రవాది

TERRORIST-FIRES-IN-SRINAGAR

శ్రీనగర్‌‌: భారత ఉత్తర భాగాన ఉన్న జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు. ఈ రోజు పట్టపగలు, నడి రోడ్డు పై కాల్పులకు బరి తెగించారు. జమ్మూ కశ్మీర్ లో ఉన్న ఒక దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పైన కాల్పులకు తెగ బడ్డాడు ఓ ఉగ్రవాది.

శ్రీనగర్‌ భగత్‌ బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. బర్జుల్లాలోని ఓ దుకాణం వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఒకరు నిలబడి ఉన్నారు. ఇంతలో నడుచుకుంటూ వచ్చిన ఒక ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే 47 తుపాకీతో కాల్పులతో విరుచుకు బడ్డాడు.

అనుకోని ఈ సంఘటన చూసి అక్కడ చుట్టు పక్కల ఉన్న స్థానికులు త్రీవ ఆందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం ఆ ఉగ్రవాది అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురించి తెలిసిన ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే ఉన్న సీసీకెమరాలో ఉగ్రవాది దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి, వాటిని పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular