అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రణాలిక రూపొందిస్తున్నట్లు బీజేపీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
“కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉండడంతో కుప్పం, దగదర్తి, మూలాపేటలో కొత్త విమానాశ్రయాలను ప్లాన్ చేయగలుగుతున్నాం” అని ఆమె ‘X’లో పోస్ట్ చేశారు. ఈ ప్రణాలిక కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా ఆర్థిక పురోగతిని కూడా ప్రోత్సహిస్తుంది అని ఆమె చెప్పారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియోజకవర్గం, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) కీలక భాగస్వామిగా ఉంది.
మరో రెండు విమానాశ్రయాలను నెల్లూరు జిల్లాలోని దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీకి చెందిన కె. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో భోగాపురం పనులలో జోరుగా సాగుతున్నాయి.ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కూడా గత వారం భోగాపురంలో పర్యటించి జూన్ 2026 నాటికి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని జిఎంఆర్కు ఆదేశాలిచ్చారు.
డిసెంబర్ 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని సదరు కంపెనీ కూడా హామీ ఇచ్చింది. విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలు రెండింటిలోనూ త్వరితగతిన అభివృద్ధి చెందేలా విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేయడం ప్రభుత్వ ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని, అభివృద్ధి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.