న్యూఢిల్లీ: పాఠశాలలు, కళాశాలలు మరియు విద్యాసంస్థలు ఆగస్టు చివరి వరకు మూసివేయబడతాయి అని ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన తాజా అన్లాక్ 3.0 మార్గదర్శకాలలో తెలిపింది.
లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు బుధవారం విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు ముగియనుండటంతో, కేంద్రం తాజా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్లాక్ 3.0లో రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను పూర్తిగా తొలగించారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు ఇవే (UNLOCK 3.0 INDIA GUIDELINES):
- సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్స్, మెట్రో రైలు పై నిషేధం ఇంకా కొనసాగింపు(అయితే పరిస్థితులను బట్టి వీటి అనుమతులపై నిర్ణయం తిసుకుంటామని కేంద్రం తెలిపింది).
- స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత
- ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్లకు అనుమతి
- సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది
- అలగే కంటైన్మెంట్ జోన్లలో అంక్షలు కొనసాగుతాయి
- భౌతిక దూరం, వైద్య నిబంధనలు పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు.
- సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది.