fbpx
Wednesday, February 19, 2025
HomeAndhra Pradeshవాలెంటైన్స్ డే నాడే దారుణం: యువతిపై కత్తిపోటు, యాసిడ్ దాడి

వాలెంటైన్స్ డే నాడే దారుణం: యువతిపై కత్తిపోటు, యాసిడ్ దాడి

VALENTINE’S-DAY-ATROCITY – YOUNG-WOMAN-STABBED,-ACID-ATTACK

గుర్రంకొండ: వాలెంటైన్స్ డే నాడే దారుణం జరిగింది. యువతిపై కత్తిపోటు, యాసిడ్ దాడి

అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో వాలెంటైన్స్ డే రోజున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు, ప్రేమ నిరాకరణను సహించలేక యువతిపై కత్తితో దాడి చేసి, అనంతరం యాసిడ్ పోసి పరారయ్యాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హత్యాయత్నం?

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని మీద ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు మదనపల్లిలో డిగ్రీ చదువుతుండగా, అదే ప్రాంతానికి చెందిన తోటి విద్యార్థి గణేష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

బాధితురాలి వివాహం ఏప్రిల్ 29న జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు, కత్తితో ఆమెపై దాడి చేసి, అనంతరం యాసిడ్ పోశాడు. యువతి ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి.

పరారీ

గణేష్, మదనపల్లెలోని అమ్మ చెరువు మిట్ట ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. దాడి అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో బాధితురాలిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసుల విచారణ

బాధితురాలి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమై నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాడికి గల అసలు కారణాలపై దర్యాప్తు మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular