దుబాయ్: భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన గౌరవం లభించింది. దుబాయ్లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల యొక్క మైనపు విగ్రహాలు ఉన్నాయి.
దుబాయ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అక్టోబరు 14న దుబాయ్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇది టీమిండియా కెప్టెన్ కోహ్లికి రెండవ మైనపు విగ్రహం కావడం విశేషం. గతంలో 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కాగా 2021 లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్ ఈనెల 24వ తేదీన దాయాది పాకిస్థాన్తో తొలి మ్యాచ్ ఆడబోతోన్న విషయం తెలిసిందే.