fbpx
Monday, September 16, 2024
HomeBig Storyతోడేళ్ల దాడులు.. మనుషులపై ప్రతీకారం ?

తోడేళ్ల దాడులు.. మనుషులపై ప్రతీకారం ?

WOLF-ATTACK-KIDS-IN-BAHRAICH
WOLF-ATTACK-KIDS-IN-BAHRAICH

బహ్రయిచ్‌: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, తోడేళ్లను కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా, స్పెషలైజ్డ్ షార్ప్ షూటర్లను కూడా నియమించింది.

అటవీ అధికారులు, తోడేళ్లు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.

తోడేళ్ల నివాసాలకు లేదా పిల్లలకు హాని జరిగితే అవి ప్రతీకారం తీర్చుకోవడానికి మనుషులపై దాడులు చేస్తున్నాయని సూచించారు.

బహ్రయిచ్‌ గ్రామాల్లో ప్రజలు తోడేళ్ల పిల్లలను ఇటీవల చూసినట్లు తెలిపారు. వరదల వల్ల తోడేళ్ల నివాసాలు నాశనం కావడంతో, అవి తమ పిల్లలను కోల్పోయినట్లు భావిస్తున్నారు. 1996లో ప్రతాప్‌గఢ్‌లో కూడా ఇలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుందని గుర్తుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular